PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంటను దున్నిన వారిపై చర్యలు తీసుకోండి..

1 min read

బైరాపురం గ్రామానికి చెందిన దంపతులు కన్నీటి పర్యంతం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మాకు చెందిన రెండు ఎకరాల పొలంలో వేసిన కొర్ర పంటను దున్ని నాశనం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు.వివరాల్లోకి వెళితే   నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని బైరాపురం గ్రామానికి చెందిన కాలప్ప  ఈశ్వరయ్య,ఉమాదేవి లకు చెందిన పొలంలో ఈనెల 29 సోమవారం రోజున ఉదయం మా బంధువులే ఎద్దుల గడెంతో బాగున్న పంటను నాశనం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పొలానికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నా మాకు న్యాయం జరగడం లేదని అన్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వారు న్యాయం చేయడం లేదన్నారు. మేము అప్పులు చేసి పంటను వేసుకున్నామని అన్నారు. మాకు ఏమైనా జరిగితే మా బంధువులే కారణమని ఇప్పటికైనా పంటను నాశనం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని వారు అన్నారు.

About Author