PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెదేపా అధికారంలోకి రావడం తథ్యం

1 min read

కాత -ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: తెలుగుదేశం పార్టీ (కూటమి)అధికారంలోకి రావడం ఖాయమని మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ కాదా రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం మిడుతూరు పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలు జరిగాయని ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పోవడం ఖాయమని ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని గత సంవత్సరం రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బు పంచినా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను పట్టభద్రులు ఎన్నుకున్నారని వాటి మాదిరే ఈ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతుందని అంతే కాకుండా గత ఎన్నికల కంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారీగా మూడు శాతం ఓటింగ్ శాతం పెరిగిందని టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులు అయ్యారని వచ్చే నెల 4వ తేదీ కౌంటింగ్ రోజున జగన్ సైకో ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని కా తా రమేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు నాగేంద్రుడు,వెంకటేశ్వర రెడ్డి నాయకులు బన్నూరు శ్రీనివాసరెడ్డి,సుధాకర్ రెడ్డి, ఇద్రిస్,సర్వోత్తమ్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,మగ్బుల్ బాష,చాంద్ తదితరులు పాల్గొన్నారు.

About Author