PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాఘవేంద్ర స్వామి ని దర్శించుకున్న టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  అమావాస్య సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు బుధవారం వచ్చారు. వీరికి టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, నాయకులు ఘన స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహత్మ గాంధీ కి నివాళులు : – మహత్మ గాంధీ  జయంతి సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి రాఘవేంద్ర సర్కిల్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి నివాసంలో తేనేటి విందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, కోసిగి భరద్వాజ్, ఎస్ఐ పరమేష్ నాయక్, మైనార్టీ జిల్లా కార్యదర్శి వగరూరు అబ్దుల్ సాబ్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోబు, భీమన్న ఆచారి,వట్టేప్ప గారి నరసింహులు, చెట్నహల్లి ఈరన్న, హనుమంతు, రామకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు సాయికుమార్ రెడ్డి, స్కూల్ కమిటీ ఛైర్మన్ సున్నం గురురాజ, రాఘు, వట్టేప్ప సుంకప్ప, వట్టేప్ప రఘు, వనికే నాగరాజు, వనికే భీమేష్, వగరూరు దస్తగిరి, సూగురు సుజ్ఞనానం, తిమ్మాపురం కేశవ, చెట్నహల్లి లక్ష్మన్న, తిక్కస్వామి, రవి, తదితరులు పాల్గొన్నారు.

About Author