PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కుబడి తీర్చుకున్న టిడిపి జిల్లాతెలుగు యువత అధికార ప్రతినిధి

1 min read

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని

-పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజారిటీ గెలవాలని మొక్కుబడి

– తన కుటుంబ సభ్యులతో మొక్కుబడి తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్రగా వెళ్లిన

 -టిడిపి జిల్లాతెలుగు యువత అధికార ప్రతినిధి ముండ్ల శ్రీనివాసులు రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే కమలాపురం శాసన సభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఏడుకొండలవాడికి మొక్కుకోవడం జరిగిందని తన కోరిక నెరవేరినందుకు తన కుటుంబ సభ్యులతో సహా తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కుబడి తీర్చేందుకు తన కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి ముండ్ల శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో మండలంలోని గుర్రంపాడు పంచాయతీ లోని ఓబులంపల్లె నుండి దేవుని తొలి గడప పాత కడప లోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం అక్కడి నుండి తిరుమలకు బయలుదేరి వెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుర్రంపాడు పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో హేమా హేమీ లైనటువంటి ఎందరో నాయకులు ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ సాధించడంతోపాటు ఎమ్మెల్యేగా పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగిందన్నారు. తన పంచాయతీలో అత్యధిక మెజారిటీ సాధించడమే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్ డి ఏ కూటమి అత్యధిక స్థానాలు సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో తన కోరిక నెరవేరిందని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి తన పంచాయతీలో వైసిపి హేమా హేమీలదే పై చేయిగా ఉండేదని అలాంటిది ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు రావడం, దీంతో పార్టీ లో పనిచేసే ప్రతి కార్యకర్త తన శక్తికి మించి పనిచేయడం ద్వారా పంచాయతీలో మంచి పట్టు సాధించగలిగామని దాంతో ఆర్థిక మంచి మెజారిటీ రావడం జరిగిందన్నారు. ఇదే ఉత్సాహంతో, ఇదే ప్రోత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇదంతా కూడా ఇలా జరగడానికి ఆ ఏడుకొండలవాడు ప్రసాదించిన వరమేనని అందుకే ఆయనకు తాము మ్రోక్కు కున్న మొక్కుబడి తీర్చుకునేందుకు తమ కుటుంబ సభ్యులతో సహా తమ పంచాయతీ నుండి తిరుమలకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని తమ ఆకాంక్ష అని ఆయన తెలిపారు. టిడిపి నాయకులు ముండ్ల శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారని తెలియడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు కలిసి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *