PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య ప్రజలను కోరారు. గురువారం నందికొట్కూరు మండలం  బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో  ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగా  బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో  టిడిపి నాయకులు గౌరు మురళీధర్ రెడ్డి, జయరాం రెడ్డి ఆధ్వర్యంలో  టీడిపి నాయకులు మాండ్ర లింగారెడ్డి ,  నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య  చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలను వివరించి మే13 నా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గిత్త జయసూర్య మాట్లాడుతూ  తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో  ఒక అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలుపుతూ సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలని కోరారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని  సమస్యలను పరిష్కరిస్తానని భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి రషీద్ అహ్మద్, తస్లీమ్, ముత్తుజ, ఉబేదుల్లా బేక్, బసురుల్ల బేగ్, అల్లా బకాష్ కలియుల బేగ్, ఖాజావలి బాగ్, మాల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, సుబ్బన్న, నారాయణ, కట్ట రాంబాబు, ఉమా శంకర్, అశోకు, రత్నము, రామ లక్ష్మణ, లేపాక్షి, బొల్లి నాగరాజు వెంకటేశ్వర్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author