PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రచారంలో వేగం పెంచిన టిడిపి..

1 min read

మరోపక్క టిడిపిలోకి భారీగా చేరికలు..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది.మరోపక్క టిడిపిలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి.నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మండల శివానందరెడ్డి,నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య మిడుతూరు గ్రామంలో టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని వారు ప్రారంభించారు.అదేవిధంగా మిడుతూరు గ్రామానికి చెందిన కొందరు యువకులు పార్టీలో చేరారు.ఎన్నికల దగ్గరికి సమీపిస్తున్నందున మిడుతూరులో ఒకపక్క మాండ్ర శివానందరెడ్డి మరో పక్క జయసూర్య రెండు గ్రూపులుగా గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని వారు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే మీ దీవెనలు ఎంతో అవసరమని శివానందరెడ్డి అన్నారు. మధ్యాహ్నం 12:30 కు కడుమూరు గ్రామంలో వైసీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి మరియు జయ సూర్య సమక్షంలో మైనార్టీ మరియు ఎస్సీ కాలనీ వాసులు పార్టీలో చేరారు. అబ్దుల్ రహీం ఫరూక్ అస్లాం రాజారావు సురేష్ రమేష్ రాంబాబు సమీముల్లా అబ్దుల్ బషీర్ అబ్దుల్లా వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ఖాతా విష్ణువర్ధన్ రెడ్డి,కాతా హరి సర్వోత్తమ్ రెడ్డి,కాతా మోహన్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,ఇ ద్రిస్,సుధాకర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి, సంపంగి రవీంద్రబాబు, సర్వోత్తమ్ రెడ్డి,చాకర్ వలి, మండల యువ నాయకులు యరభం ప్రమోద్ రెడ్డి,సుభాన్,లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author