PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్లను పంపిణీ చేసిన టిడిపి నాయకుడు బాలరాజు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఎన్టీఆర్భరోసా పింఛన్ల ను టిడిపి నాయకుడు బాలరాజు   సోమవారం పంపిణీ చేశారు.ఎన్నికల ముందు టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు వితంతువులు పింఛన్లు 3వేలనుంచి 4 వేల వరకు, దివ్యాంగులు 3వేల నుంచి 6 వేలకు మరియు తదితర పింఛన్లు పెంచుతానని మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం నెల రోజుల్లోనే పింఛన్లను పెంచి సోమవారం రోజున ఉదయం 6 గంటల నుంచే గ్రామాల్లో ప్రతి వాడలోనూ పెరిగిన పింఛన్లను అధికారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేస్తూ ఉండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పింఛన్లు పెంచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

About Author