PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టి.జి భరత్ ను కలిసిన టీడీపీ నాయకులు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను ఆదివారం టీడీపీ కర్నూలు జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు.  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆంధ్ర ప్రదేశ్​ కు పరిశ్రమలు తీసుకొచ్చి.. అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కర్నూలును స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాక కార్పొరేషన్​ పరిధిలో నిలిచిన అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్​   పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను కోరారు.  మంత్రి టి.జి. భరత్​ భవిష్యత్​లో మరెన్నో పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు.

About Author