PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి నాయకులు.. వైసిపి నాయకుడు మల్కాపురం పెద్దయ్య పై దాడి

1 min read

తీవ్రంగా ఖండించిన నియోజకవర్గం ఇన్చార్జి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మండలం పరిధిలో  మల్కాపురం గ్రామంలో  ఉదయం పొలం దగ్గర టిడిపి నాయకులు మేకల రంగస్వామి, మేకల లక్ష్మీనారాయణ కాపు కాచి రాళ్లు, కర్రలతో వైసిపి నాయకులు  పెద్దయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని తెలుసుకొన్న ఎమ్మిగనూరు నియోజవర్గ ఇన్చార్జి శ్రీమతి బుట్టా రేణుక ఫోన్ ద్వారా మల్కాపురం పెద్దయ్యను పరామర్శించి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తీవ్రంగా గాయపడిన   వైసిపి నాయకులు పెద్దయ్యను పరామర్శించి,ఎమ్మిగనూరు మండలంలో జరుగుతున్న వరుస దాడులను ఖండించారు, మంగళవారం పరమానందొడ్డి లోను, ఈరోజు మల్కాపురంలోనూ జరిగిన రాజకీయ దాడులను తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల వివిధ గ్రామాల సర్పంచులు  కోటేకల్ లక్ష్మన్న, కడివెళ్ల రంగస్వామి,మల్కాపురం దేవేంద్ర రెడ్డి,దేవిబెట్ట వెంకటరామిరెడ్డి, నాగలాపురం రాఘవేంద్ర,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author