PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరినాథ్ చౌదరి అంత్యక్రియలకు హాజరైన టిడిపి నాయకులు  

1 min read

పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన దేశం జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, నాయకులు 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో వై.సి.పి వారు హత్య చేసినటువంటి గౌరి నాథ్ చౌదరి అంత్యక్రియలు వారి గ్రామంలో జరుగగా కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పత్తికొండ ఎం.ఎల్.ఏ కె.ఇ.శ్యాం కుమార్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కె.మీనాక్షి నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్, కె.ఇ.రుద్ర ఫని గౌడ్ మొదలగు వారితో పాటు స్థానిక నాయకులు హాజరై పార్టీ పతాకాన్ని హతుడిపై ఉంచి శ్రధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి వారి కుటుంభ సభ్యులను పరమార్శించి ధైర్యం చెప్పారు.  పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత ధృష్టికి తీసుకొనివెళ్ళి పార్టీ పరంగా అన్ని విధాల సహాయ సహకారం అందజేస్తానని భరోసా ఇవడమైనది.పాలకుర్తి తిక్కారెడ్డికర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు.

About Author