PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షాన్ని సైతం లెక్కచేయని..టిడిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా టిడిపి నాయకులు అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు.నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ 1,22 వార్డులలో సీనియర్ టిడిపి నాయకులు నిమ్మకాయల మోహన్,22వ వార్డు ఇన్చార్జి కళాకర్ ఆధ్వర్యంలో శనివారం ఏబీఎం పాలెంలో వర్షంలోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు.సచివాలయ సిబ్బంది ప్రమోద్,దావీదు, వెంకటస్వామి,మమత, పద్మావతి,రమేష్ వర్షంలో తడుస్తూనే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు.ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో 31వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉ 6 గంటల నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు అందజేశారు.ఈ కార్యక్రమంలో బొల్లెద్దుల సామేలు,బంగారు సురేష్, అడివప్ప,ప్రేమ్,లాలు,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author