PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కులు తీర్చుకున్న టిడిపి నాయకులు 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మండలం లోని ముండ్లపల్లి టిడిపి నాయకులు అల్లాడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వినాయక దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టడం జరిగింది, ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలందరికీ తెలియజేయడంతో, వారందరూ నారా చంద్రబాబు నాయుడు నమ్మి టిడిపి కి పట్టదు కట్టడం జరిగిందన్నారు, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గం లో పుత్త కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగిందని వారు తెలియజేశారు, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని అందుకే జనసేన, బిజెపి, టిడిపి కూటమిని ప్రజలు విశ్వసించారు కాబట్టే ఇంతటి అపారమైన మెజారిటీ ఇవ్వడం జరిగిందన్నారు, అనుభవజ్ఞులు, అపార పరిజ్ఞానం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన నేతృత్వంలో, అటు పోలవరం కానీ, ఇటు రాజధాని కానీ అన్ని విధాల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ తాటిగొట్ల వెంకటసుబ్బారెడ్డి( బుజ్జన్న), యూనిటీ ఇన్చార్జి ముండ్ల శ్రీనివాసుల రెడ్డి , ఐటీడీపీ యమల  మణికంఠ ,మాదిరెడ్డి చరనీస్ రెడ్డి, అబ్దుల్, సుబ్బారెడ్డి బండి, మీగడ శివారెడ్డి, పొట్టిపాటి తిరుపాల్రెడ్డి, రామచంద్రారెడ్డి, మల్లయ్య, వెంకటయ్య, బుక్కన తిలక్, జంగిటి సుబ్బరాయుడు మహిళలు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author