PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిత్త జయసూర్యకు జననీ రాజనం..బ్రహ్మరథం

1 min read

ఈలలు కేకలు హంగామా నడుమ చౌటుకూరులో పసుపు మయం

 పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మీ చల్లని దీవెనలు మీ ఆశీస్సులు నాపై ఉంటే చాలు అని నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు.మిడుతూరు మండలంలోని చౌటుకూరు,చెరుకుచెర్ల గ్రామాల్లో గురువారం సా.6 గంటలకు రోడ్ షో చేపట్టారు.నాయకులు వీరికి బాణాసంచా కాలుస్తూ పూలమాలలతో ఘనస్వాగతంతో వీధుల్లో యువకులు ఈలలు కేకలు హంగామా నడుమ గ్రామం పసుపు మయంగా మారింది. తర్వాత జరిగిన సభలో జయసూర్య మాట్లాడుతూ  గత ఐదేళ్ల పాలనలో అలగనూరు రిజర్వాయర్ గండి మరమ్మతులకు నోచుకోలేదన్నారు.మన మండలంలో ఈ ఎన్నికల్లో టిడిపి మంచి మెజార్టీ రావడానికి మీరంతా కృషి చేయాలని చౌటుకూరులో పొలాల రస్తా వేయించడం ఇక్కడ ఇంటి స్థలాలు ఇండ్లు మంజూరు చేస్తామని అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదని ఎన్నికల్లో మీకు ఎంత డబ్బు ఇచ్చినా సరే మీరు మోసపోవద్దు మీరు ఆలోచించి ఓటు వేయాలన్నారు.రైతులు బాగుపడాలంటే నీళ్లు ఉండాలి నీళ్లు ఉంటే ప్రజలు బాగుపడతారని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ముఖ్యంగా సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి, చెరుకుచెర్ల రఘురామయ్య,హరి సర్వోత్తమ్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,బాబు సాహెబ్,గోకారి,నరసింహ గౌడ్, జగన్నాథం గౌడ్ సతీమణి రమణమ్మ,షబ్బు,సామన్న లక్ష్మీనారాయణ,సుభాన్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author