PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ అండగా ఉంటుంది..ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం, పోతుదొడ్డి మాజి సర్పంచ్ రంగనాయకులు మరియు వారి కుటుంభ సభ్యులపైన స్థానిక వైసిపి నాయకులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది.  వైసిపి నాయకుల చేతిలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగనాయకులు మరియు వారి కుటుంభ సభ్యులను డోన్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి , తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్ పరమార్శించడం జరిగింది.  ఈ సంధర్బంగా దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకోవడం జరిగింది.  తెలుగుదేశంపార్టీ వారికి అండగా ఉంటుందని భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పడం జరిగింది.  నియోజకవర్గం లో వైసిపి నాయకుల అరాచకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ,, శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ధృష్టికి తీసుకొనివెళ్ళడం జరిగిందని వారు తెలిపారు.

About Author