PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భానుడి భగ భగ.. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయని చెప్పటమే కానీ. చూడలేదని ఈ మాటను నిజం చేస్తూ. గత వారం రోజులుగా మండలంలో భానుడు భగభగ మండుతున్నాడు ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావాలంటే జంకుతున్నారు ముందస్తు వర్షాల ప్రభావంతో రెండు వర్షాలు పడ్డ ఉదయం 7 నుండి భానుడు బయటికి రావడం విపరీతమైన ఉష్ణోగ్రత పెరిగిపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈనెల ఆఖరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొనడం ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు మధ్యాహ్నం రహదారులన్ని  నిర్మానుష్యమైపోతున్నాయి వృద్ధులు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

About Author