PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెరజా ఫుడ్ కోర్ట్ ప్రారంభం…

1 min read

ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ , మేయర్ నూర్జహాన్ పెదబాబు

నగర ప్రజలకు విభిన్నమైన రుచులు అందించటంమే మా ప్రత్యేకత

షేక్ మౌలాలి, జరిగంటి రాజారావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక జిల్లా పరిషత్  కార్యాలయం వద్ద శుక్రవారం నాడు తెరజా ఫుడ్ కోర్ట్  ప్రారంభమైంది. నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు,  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు ప్రారంభించారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్ర మంలో నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్లు షేక్ మౌలాని, గరిగంటి రాజారావు మాట్లాడుతూ ఏలూరు వాసులకు విభిన్నమైన రుచులను అందించేందుకు తము సిద్ధంగా ఉన్నామ న్నారు. తమ ఫుడ్ కోర్ట్ లో నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ తో బాటు లంచ్, డిన్నర్లలో సౌత్ ఇండియా వెజ్ తాలి, నాన్ వెజ్ తాలి, రుచికరమైన బిర్యాని ప్రత్యేకంగా ఉంటాయ న్నారు. విభిన్నమైన సాంప్రదాయ వంటకా లతో ఏలూరు చుట్టు పక్కల ప్రాంతాల  వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తేరజా పుడ్ కోర్టు హిందు, ముస్లింల సాంప్రదాయ వంటకాల మేలు కలయిక అని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేటర్ రియాజ్,  మిత్రులు కార్తీక్, అజయ్  శుభాకాంక్షలు తెలిపారు.  వచ్చిన అతిథులకు సంస్థ అధినేతలు షేక్ మౌలాని, గరిగంటి రాజారావు సాదరంగా స్వాగతం పలికారు.

About Author