PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబును క‌లిసిన టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ క‌లిశారు. చంద్రబాబును క‌లిసి ఎన్నిక‌ల పోలింగ్ గురించి చ‌ర్చించిన‌ట్లు టి.జి భ‌ర‌త్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేసిన‌ట్లు చంద్రబాబుకు వివ‌రించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో కూట‌మి అధికారం చేప‌ట్టబోతుంద‌ని చంద్రబాబు నాయుడు చెప్పార‌ని టి.జి భ‌ర‌త్ అన్నారు.

About Author