PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి నిమ్మలను కలిసిన తమ్మడపల్లి విక్టర్..

1 min read

విక్టర్ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే శ్యాంబాబు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు ఆదివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వచ్చారు. మంత్రని నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ తుమ్మడపల్లి విక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేతో స్వాగతం పలికారు.అదేవిధంగా మంత్రి వెంట వచ్చిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పర్యటన అనంతరం విక్టర్ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు విక్టర్ మరియు తమ్మడపల్లె శేఖర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు.అనంతరం విక్టర్ కేఈ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో తమ్మడపల్లె బ్రదర్స్ తో ఎమ్మెల్యే శ్యాంబాబు పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు.తర్వాత ఎమ్మెల్యే శ్యాంబాబును మరియు తుగ్గలి నాగేంద్ర ను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖర్,రిటైర్డ్ ఎస్ఐ.పెరుమాళ్ళ జాన్, నవీన్,ప్రసాద్,ఫ్రాన్సిస్, ఆనంద్,వినోద్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *