PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి నాయకులకు ధన్యవాదాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కురువ సంఘ నాయకులు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. స్థానిక గాంధీనగర్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమలో బీసీ కులాలలో కురువ కుల ప్రధమ  స్థానంలో ఉన్నదని దీనిని గుర్తించి గత 2019 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానం అవకాశం కల్పించారని, అన్నారు .అలాగే ఆయన క్యాబినెట్లో మంత్రి పదవి అవకాశం కురుబకులానికి కల్పించాలని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు రెండు ఎంపీ స్థానాలు ఒక ఎమ్మెల్యే స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే స్థానానికి క్యాబినెట్ మంత్రిగా ఇచ్చారని అందుకు కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.. అనంతరం గౌరవాధ్యక్షులు తట్టి అర్జున్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ కుల రాజకీయాలు లేవని, ఇండియాలో కుల రాజకీయాలు మీదే రాజకీయాలు నడుస్తున్నాయని, ఆయన అన్నారు తప్పనిసరిగా 5 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వి .లింగమూర్తి వైస్ ప్రెసిడెంట్ మద్దిలేటి, ప్రచార కార్యదర్శి విఠల్ గౌడ్ ,పావురాలు జగదీష్ కుల సంఘ నాయకులు తదితరులు లు పాల్గొన్నారు.

About Author