PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినతుల పరిష్కారంపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి

1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజా సమస్యలపై వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన “మీ కోసం” కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. విడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా లోని అధికారులతో ప్రజల సమస్యలపై చర్చించారు. ఇకపై ప్రతి వారం నియోజకవర్గంలోని 4మండలాల్లో జరిగే మీ కోసం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని తెలిపారు.ఈ సందర్భంగా దెందులూరు మండలానికి చెందిన పలువురు గ్రామస్తులు ఎమ్మార్వో కార్యాలయంలో తమ సమస్యలపై వినతులు అందచేయగా, వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ సుమతీ, ఎంపిడిఓ శ్రీలత, టిడిపి నాయకులు ఇప్పిలి వేంకటేశ్వర రావు, మంచినేని శ్రీనివాస్, మహేష్ యాదవ్ సహా పలువురు నాయకులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author