PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలన  వైదొలగాలి

1 min read

గాంధీ విగ్రహం ముందు కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన, గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఎపిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలని కోరుతూ గాంధీ విగ్రహం ముందు కళ్ళకు గంతులు కట్టుకుని నిరసన తెలియజేసి, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రం గాంధీ విగ్రహానికి ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాసీం వలి ,విద్యార్థి విభాగం NSUI జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, యువ కాంగ్రెస్ నాయకులు దాదాకలందర్ ధ్వర్యంలో ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశంలో కులమత వేదాలతో ప్రజలకు చిచ్చు పెడుతుందని, గాంధీ మార్గంలో ప్రస్తుత ప్రభుత్వాలు నడవడం లేదని తెలిపారు. ప్రజలు యువత ప్రతి ఒక్కరూ గాంధీవాద మార్గంలో నడవాలని తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే అధికారంలో ఉన్నప్పుడే సురక్షంగా ఉంటారని తెలిపారు. మహాత్మా బిజెపి ఫ్యాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడాలని కోరారు. దేశంలో నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని  అంటాయని తెలిపారు. పెరిగిన ఈ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బనవాసిజైపాల్, రఫిక్, ఇబ్రహీం, లోకేష్, భాష, విష్ణు, హర్ష,హరీష్,రాజు, మహబూబ్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author