PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి

1 min read

ఏలూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావూరు లావణ్య

అనూహ్య జన స్పందనతో కావూరి లావణ్య ప్రచారo

చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారజోరు

పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు,అభిమానులు మహిళలు పార్టీ శ్రేణులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: నే 13వ తేదీ జరగనున్న సార్వత్రేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య ఎన్నికల ప్రచార జోరు ప్రారంభించారు. ఉదయం నుండి నిర్విరామంగా కొనసాగిన ఎన్నికల ప్రచారo గ్రామ గ్రామాన, వాడవాడలా, వీధి వీధిలో కొనసాగిస్తూ భోజనం విరామ అనంతరం మరలా సాయంత్రం నుండి ప్రజలతో మమేకమై ఓట్ల అభ్యర్థన ప్రారంభించి ఉప్పలపాడు,లక్కవరం, పంగిడిగూడెం,పేరంపేట,  జంగారెడ్డిగూడెం, గుర్వాయిగూడెం, కొంగుగూడెం, చక్రదేవరపల్లి, ఎఱ్ఱకాలువ జలాశయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలకు ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీమతి కావూరి లావణ్య  నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో జంగారెడ్డిగూడెం సీపీఎం సీనియర్ నాయకులు పసల సూర్యారావు, పట్టణ సీపీఎం కార్యదర్శి సుభాషిణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ రాయల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కావూరి లావణ్య అభిమానుల అనుచరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author