PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాన్​ ఆగిపోయింది… ఏసీ కాలం వచ్చింది…

1 min read

మిమ్మల్ని పదైదేళ్లు మోసం చేశారు….

  • మీ డబ్బులు మింగారు.. ఇక పంపండి…
  • వైసీపీకి ఓటు వేయొద్దు…
  • ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా…
  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి… రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు, పొలాల్లో చెక్​ డ్యాం నిధులను దిగమింగాడు…. ఇక చాలు సాగనంపాలని ఆదోని కూటమి  అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని సంతపేట , చాకలిగేరి, ఖాజీపురలో కూటమి (బీజేపీ–జనసేన– టీడీపీ) నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుడూతూ గత 20 రోజులుగా ఆదోనిలో ఫ్యాన్​ గాలి ఆగిపోయిందని… ఏసీ కాలం వచ్చిందని ఎద్దేవ చేశారు. మద్యం, ఇసుక, రేషన్​ మాఫియాతోపాటు భూ కబ్జాలు…దందాలు చేస్తూ…. యువతపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డికి మళ్లీ ఓటు వేయొద్దని కోరారు.  ఆదోని యువతకు ఉద్యోగాలు లేక…. కూలీలు..గుమస్తా పనులకే పరిమితమయ్యారని, ఉద్యోగం కావాలంటే బెంగుళూరు, హైదరాబాద్​ , కర్నూలుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి… తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం జనసేన నాయకుడు మల్లప్ప మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి చెందాలంటే … కమలం గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

About Author