వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
1 min readగ్రామగ్రామాన ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక
పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్ల లో నాలుగో రోజు “ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక ” కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మారెమ్మవ్వ గుడిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ “జయనాగేశ్వర రెడ్డి” . అనంతరం నాలుగో రోజు ఎస్సీ కాలనీలో “ఇది మంచి ప్రభుత్వం – ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ చింతలముని నల్లరెడ్డి స్వాముల వారి దశమి శుభాకాంక్షలు తెలియాజేశారు. వృద్ధులకు 4 వేల పెన్షన్ అందించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారని, మరోవైపు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలు అన్నిటిని దశలవారీగా నెరవేర్చి తీరుతామని తెలిపారు. వైసీపీ నాయకులకు రేపటితో ఐదేళ్లు పూర్తవుతుందని సూపర్ సిక్స్ పథకాలు చేయలేదని చెబుతున్నారు.. మన ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయింది గుర్తు పెట్టుకొని మాట్లాడాలన్నారు. దశలవారీగా ఒక్కొక్కటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మా చంద్రన్న తీసుకుంటారని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఏం చేశారు చెప్పాలని గత పాలకులను ప్రశ్నించారు. గతంలో తాను రైతుల కొరకు ఎమ్మిగనూరులో ఆర్డీయస్ ప్రాజెక్టును రెండు వేల కోట్లతో మంజూరు చేయించుకుని వస్తే గత వైసిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరిట నాశనం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటారని, ప్రతి రైతుకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.