PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందించిన హృదయం.. అందించింది ఆపన్నహస్తం

1 min read

కిడ్నీ బాధితుడికి రూ:12 లక్షలు ఎల్ఓసీ ద్వారా ఆర్థిక తోడ్పాటు

భరోసా నిచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

పల్లెవెలుగు ఏలూరు జిల్లా ప్రతినిధి : కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం కామవరపుకోట గ్రామానికి చెందిన మలకపల్లి సూర్యనారాయణకు హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్స్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 12 లక్షల రూపాయలు మంజూరు చేయించి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓసి)ని ఈరోజున బాధిత కుటుంబ సభ్యులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందచేశారు. కిడ్ని బాధితుని సమస్య తెలిసిన వెంటనే స్పందించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి 12 లక్షలు మంజూరు చేయించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *