PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవ్వా తాతల కళ్ళల్లో కనబడే ఆనందం వెల కట్టలేనిది 

1 min read

ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: ప్రతి నెల ఒకటవ తేదీన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు తీసుకుంటున్న అవ్వ తాతల ముఖాలలో వచ్చే ఆ సంతోషానికి వెలకట్టలేమని ప్రతి ఒక్క అవ్వ తాతకు 4వేల రూపాయలు ఎంతో ఆసరాగా ఉపయోగపడతాయని, వారి మందులకు, చిన్న ఖర్చులకు ఎవరి వద్ద చెయ్యి చాపడం లేకుండా ప్రతి నెల పెన్షన్ కోసం ఎదురుచూసి ఆ పెన్షన్ రాగానే వారి ముఖాలలో వచ్చే చిరునవ్వు చూసిన తర్వాత వారికి ఎంత చేసిన తక్కువే అనిపిస్తుందని కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు, గురువారం ఆయన చెన్నూరు లక్ష్మీ నగర్, సరస్వతి నగర్ , లలో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ప్రేమతో ఆప్యాయంగా పేరుపేరునా పలకరిస్తూ 4000 రూపాయలు సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చిందంటే అవ్వ తాతల యోగక్షేమాలు తెలుసుకొని వారికి నాలుగు వేల రూపాయలు అందించి వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటే భగవంతుని దర్శించుకున్నంత ఆనందం కలుగుతుందని ఇలాంటి అవకాశం రావడం దేవుడిచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవ్వ తాతలకు ఇచ్చిన మాటకి కట్టుబడి 4000 రూపాయలు ఒకటవ తేదీ తెల్లవారుజాము నుండి అధికారులు అవ్వ తాతల ఇంటికి వెళ్లి అందించడం జరుగుతుందన్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత కలిగిన నాయకుడే కాకుండా ఒక విజనరి కలిగిన నాయకుడని ఆయన అన్నారు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా విరజిల్లుతుందని ఆయన తెలియజేశారు,పెన్షన్ డబ్బులు తీసుకునే ప్రతి ఒక్క అవ్వ తాత చంద్ర బాబు చల్లగా వుండాలని అన్నప్పుడు చాలా సంతోషంగా వుంటుందని ఆయన అన్నారు , ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు పొట్టిపాటి రానా ప్రతాపరెడ్డి, మాజీ అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, ఆకుల చలపతి, మల్లికార్జున రెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి, నారాయణ, టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author