PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ దళిత నాయకుల ముఖ్య సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:   హొళగుంద మండల కేంద్రంలో గల బాలాజీ కాంప్లెక్స్ నందు టీడీపీ దళిత నాయకుల ముఖ్య సమావేశం జరిగింది .ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం టీడీపీ ప్రభుత్వం వస్తేనే దళితుల జీవితాలు బాగుపడతాయి ..అని అదేవిదంగా ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ. శ్రీ వీరభద్ర గౌడ్ గారిని ఎమ్మెల్యే గా గెలించుకుందాం అని యువతకు పిలుపు నివ్వడం జరిగింది. అదేవిదంగా మండలంలో ఉన్న టీడీపీ దళిత నాయకులందరు కలిసికట్టుగా వర్గ విభేదాలు వీడి టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని, మండలంలో ఉన్న అన్ని గ్రామలలో దళిత నాయకులు,దళిత వాడలలో ఇంటిటికి తిరిగి ప్రచారం చేసి వీరభద్ర గౌడ్ ని ఎమ్మెల్యే గా, చంద్రబాబునాయుడు ని ముఖ్య మంత్రి గా గెలిపించుకుందాం అని పిలుపు నివ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో టీడీపీ *మండల కన్వినర్ తిప్పయ్య, మాజీ కన్వినర్ వీరన్న గౌడ్ టీడీపీ సీనియర్ నాయకుడు ఉమేష్ గౌడ్,ఆలూరు mrps తాలూకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు, డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేష్, కన్నారావు, “ఐటీడీపి “మండల అధ్యక్షుడు నాగేంద్ర, తాలూకా కార్యదర్శి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి హనుమంతు సినిమా మంగన్న ఎల్లర్తి మహేష్, తాసె చిదానంద,  భాస్కర్ కొగిలతోట  గోవర్ధన్.

About Author