PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరంతరం  పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  వైసిపి ప్రభుత్వం నిరంతరం పేదల అభివృద్ధి కోసమే పాటు పడుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.నమ్మించినట్టేట ముంచడం తమ నైజం కాదని, పేదల పక్షపాతిగా ఉంటూ వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉంటామని వైఎస్ఆర్సిపి అధినేత, ముఖ్యమంత్రి జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టో మరోసారి రుజువు చేసిందని అన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రదర్శించారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి ఏవైతే చేస్తామో అవే వైఎస్ఆర్సిపి అధినేత ప్రకటించారాని వారు తెలిపారు. వృద్ధులకు 3500 చేస్తామని చెప్పడం అవ్వ,తాతలపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటి చెప్పారని తెలిపారు. అమ్మ ఒడి పెంపు, రైతు భరోసా పెంచుతూ, చేయూత సహాయాన్ని రెట్టింపు చేస్తూ కొనసాగించడం వల్ల రైతులు, మహిళలు ఆర్థికంగా నిలదుక్కుకుంటారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అమలుకు సాధ్యం కానీ విధంగా హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు దొంగ బుద్ధి గమనించి ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ నారాయణ దాస్, బిసి సెల్ జిల్లా అధ్యక్షులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, భాస్కర్ నాయక్, మండల కన్వీనర్ కారం నాగరాజు, నలకదొడ్డి కృష్ణ,హోసూరు బనగాని శ్రీనివాసులు, లలితా రామచంద్ర, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవన్న,ఎంపీటీసీ గణపతి,చందోలి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author