PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గత ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఏర్పాటులో నిర్లక్ష్యం  చేశారు: ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  గత ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించడంలో భారీగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే పార్థసారధి ఆరోపించారు.శుక్రవారం ఆదోని ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు నూతన బస్సును  ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నేను ఎమ్మెల్యేగా అయ్యాక ఆదోనిలో ఏకంగా 17 బస్సులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇది అభివృద్ధి కాదా, ఇది మార్పు కాదా అని పత్రికా విలేకరుల సమక్షంలో తెలిపారు.ఇది నా కూటమి ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. ఏదేమైనాప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి సేవలు అందిస్తుందని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *