PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీరామనగర్  కాలనీలో త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి

1 min read

బిసీవిద్యార్థి యువజన  ప్రజా సంఘాలు వినతి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని బీసీ విద్యార్థి యువజన మరియు ప్రజసంఘాలు (రజక సంఘం) ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో తాసిల్దార్ శేషపణి కివినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘం నాయకులు నరసన్న, వెంకటేష్  సీ.వీరేష్ లు మాట్లాడుతూ గుడేకల్ గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీలో దాదాపుగా 15 రోజుల నుండి త్రాగునీరు రావడం లేదు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు మరియు త్రాగు నీటి కోసం ప్రక్కన పొలాల్లో వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు తక్షణమే సంబంధిత అధికారులు చొరవ చేసుకొని త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని వారు కోరారు లేని పక్షాన కాలనీవాసులతో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు రంజాన్ భాష మరియు రామకృష్ణ లు పాల్గొనడం జరిగింది.

About Author