PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వాతంత్ర్య  సమరయోధుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలి…మంత్రి టి.జి. భరత్​

1 min read

కర్నూలు పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు … శ్రీ టి.జి.‌భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాషా , జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ లతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు  టి.జి.‌భరత్  పరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుండి వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య  ఉద్యమంలో  సమరయోధుల త్యాగాలను కొనియాడి నివాళులు అర్పించారు. ప్రభుత్వం చేపట్టిన పరిపాలన వ్యవస్థ, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై సందేశం ఇచ్చారు. విధులలో ప్రతిభ కనబరచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.హాజరైన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్,  ఎమ్మెల్సీ మధుసూదన్,  కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు,  జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,  హోంగార్డు కమాండెంట్ సదరన్ రిజీయన్ మహేష్ కుమార్,  డిఎస్పీలు,  ఇతర ప్రజాప్రతినిధులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About Author