PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తల్లి మరణించిన మూడు రోజులకే కుమారుడు మృతి

1 min read

మృతి చెందిన కుటుంబాలకు జయసూర్య నివాళులు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు(మిడుతూరు): తల్లి మరణించిన మూడు రోజులకు కుమారుడు మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా పగిడాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది.పగిడ్యాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధురాలు గుండెపోగు రాధమ్మ మూడు రోజుల క్రితం మరణించారు.తల్లి మృతుని తట్టుకోలేక శుక్రవారం ఉదయం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో కుమారుడు గుండెపోగు మహేష్ ఉరివేసుకొని మరణించారు.నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ వెంకటేశ్వర్లు గురువారం మృతి చెందారు.వీరిద్దరి మృతుని ఇండ్లకు వెళ్లి వీరి పార్థివ దేహాలకు నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య పూలమాలతో నివాళులు అర్పించారు.అదే విధంగా వీరి ఇద్దరి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పగడాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి,పగడం శేఖర్,కొట్టాల విజయ్,జయేశ్వర్ రావు,బుజ్జి,చెన్నకేశవులు,బోయ పాండు,కైలుల్లా బేగ్, దయాకర్,జయాకర్,అనిల్ కుమార్,మనిరాజు పాల్గొన్నారు.

About Author