PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు సంక్షేమమే  దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రివర్యులు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  obc జిల్లా చైర్మన్ ,కాశీం వలి, ఎన్ ఎస్ యు వై జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్, యువ కాంగ్రెస్ నాయకులు దాదా కలందర్, ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రైతుల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ,108, ఫీజు రియంబర్స్మెంట్, ప్రాజెక్టుల పూర్తి, ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు, పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రివర్యులు రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఫిక్ ,లోకేష్, విష్ణు, అజయ్,బాషకర్, వలి,షఫీ , తదితరులు పాల్గొన్నారు.

About Author