PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ ను నమ్మే పరిస్థితి దేశంలో లేదు 

1 min read

 మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా 

పల్లెవెలుగు వెబ్ కడప : రాష్ట్రంలో 151 స్థానాలతో అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోయి అత్యంత ఘోరంగా ఓడిన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే స్థితి భారతదేశంలో లేదని ఢిల్లీ లో ధర్నా చేస్తా అనడం హాస్యాస్పదం అని కడప నగర మాజీ డిప్యూటీ మేయర్ అరిఫుల్లా అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి ఘోరంగా ఓడిపోయినా షాక్ లో మాజీ సీఎం జగన్ మతిస్థిమితం లేక రాష్ట్రపతి పాలన కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వారి పార్టీ నాయకుల మధ్య వాటాలు కుదరక ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని హత్యలు చేసుకుంటుంటే సిగ్గుపడాల్సింది పోయి పరామర్శించడమే కాక శాంతి భద్రతలకు విఘతాం కల్పించి అల్లర్లు సృష్టించాలని భావిస్తే ప్రజల్లో ఇంకా చులకన అవుతారని, ఇటువంటి చౌకబారు విమర్శలు, చర్యలు మానుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వానికి నిర్మాణత్మకమైన సలహాలు ఇస్తే ప్రజలు హర్షించి కరుణిస్తారని సూచించారు. ఇప్పేటికే వైసీపీ నాయకులు విలువైన వనరులన్నింటిని దోచుకొని రాష్ట్ర సహజ సంపద కోళ్లగొట్టారానే ప్రజలు ఆగ్రహించి మీకు ఈ పరిస్థితికి తెచ్చారని అన్నారు. ఢిల్లీ లో ధర్నాచేస్తే దేశమంతా పరువు పోవడం ఖాయమన్నారు.

About Author