PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొన్నాపురం లో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత ఐదు రోజులుగా నంద్యాల పట్టణం, పొన్నాపురం ఎస్సీ కాలనీలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో  జరుగుతున్న  ధార్మిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ప్రతి రోజూ ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు  కాల్వ రమేష్, కంభగౌని తిరుమల గౌడ్, పసుపుల రామ నర్సింహులు, అర్చకులు మన్యం మహేష్, బరాబరి లింగేశ్వరరావు, వెంకటరావు,   నాగిళ్ల హరిబాబు, పామయ్య, జంగా లక్ష్మీకాంత్, పి.వెంకట జానకయ్య  భజన గురువు నాగెళ్ళ ఆదిశేషమ్మ, చిట్టి నరసింహులు, పి. సుభద్రమ్మ, గాయిత్రి, ఎన్. లక్ష్మీదేవితో పాటు భక్త సమాజం పాల్గొన్నారు.

About Author