PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ని దర్శించుకున్న వేలాది మంది భక్తులు

1 min read

స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు

వివిధ సేవలణ రూ:2,09,476/-లు ఆదాయం

ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు

నిత్య అన్నదాన సత్రంలో 1300 మంది ప్రసాదం స్వీకరణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం మరియు వేసవి శలవులు కావడంతో వేకువఝాము నుండి వేలాది మంది భక్తులు, విద్యార్ధులు  బారులుతీరి దర్శించుకున్నారు. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు  శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు  చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. భక్తుల సౌకర్యార్ధం  ఆలయమువద్ద గల  మజ్జిగ చలివేంద్రంవద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.2,09,476/- లు  సమకూరినది.  సుమారు 1300 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు.  శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు   పర్యవేక్షణలో  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.

About Author