PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు తిధి భోజనం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు  :మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొక్కరాయపల్లె నందు సోమవారం దాత మాజీ ఎంపీటీసీ వాసుదేవరెడ్డి శిక్షా సప్తహలో భాగంగా తిధి భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని పిల్లలందరికీ మాంసాహార భోజనం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ-2 సునీత మాట్లాడుతూ, పేద పిల్లలకు ఒక రోజు రుచికరమైన ఆహారం అందించాలనే ప్రభుత్వ ఆదేశాలకు దాత వాసుదేవరెడ్డి తిధి భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డిని అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు హేమలత, వీరనారాయణ, సిఆర్ఎంటి విజయమ్మ ,సూరి, లక్ష్మణ్, రవి ,గురయ్య సుగుణమ్మ , విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author