PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం

1 min read

అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి  బుట్టరేణుక వెల్లడి

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  రోడ్ షో లో గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలం వేంకటగిరి, బనవాసి ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట  గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారు  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వచ్చాయన్నారు.. జగనన్న అంటే మన నమ్మకం అని, జగనన్ననే మన భవిష్యత్తు అని పిలుపునిచ్చారు.. గతంలో టిడిపి ప్రభుత్వంలో పథకాలు లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీ మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇస్తేనే పథకాలు అందేవి అని, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్దిదారులకు ప్రతివారికీ పథకాలు వస్తున్నాయని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో వృత్తులు చేసేవారికి, మహిళ సంఘాలకు, విద్యార్థులకు, వృద్దులకు ఇలా అందరికి అన్ని వర్గాలకు, అన్ని మతాల వారికి, కులాల వారికి లబ్ది చేకూరిందని అన్నారు. మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే  ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై. రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారం లో, మండల అధ్యక్షుడు బి ఆర్ బసిరెడ్డి,సోగునూరు బీమిరెడ్డి, సర్పంచులు,ఎంపీటీసీలు,ఆయా గ్రామ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,తదితరులు పాల్గొన్నారు.

About Author