PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలకు సెలవు

1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 2వ తేదీ సోమవారం సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని డీఈఓ, డివిఈఓలకు ఆదేశాలు జారీ చేస్తూ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

About Author