PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 24 వరకు బదిలీల దరఖాస్తు గడువు: డీపీఓ నాగరాజ నాయుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:       రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 75 ప్రకారం పంచాయతీరాజ్ శాఖలో సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, విస్తరణాధికారులకు బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు డిపిఓ నాగరాజ నాయుడు తెలిపారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న సిబ్బంది, ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి వారికి అభ్యర్థన బదిలీలు (రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్) దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24వ తేదీ వరకు గడువు నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం సంబంధిత ఎంపిడిఓ వారి ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను డిపిఓ కార్యాలయానికి పంపవచ్చని చెప్పారు. అంతేకాకుండా సంబంధిత ఉద్యోగులు నేరుగా డిపిఓ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. కర్నూలు జిల్లా వారు కర్నూలు డిపిఓ కార్యాలయంలో, నంద్యాల జిల్లా వారు నంద్యాల డిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేయవచ్చని అన్నారు. ఈ రెండు జిల్లాల వారు పరస్పరం జిల్లా మారాలనుకుంటే రెండు జిల్లాల డిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తు ప్రతులు సమర్పించాలని ఆయన ఆదేశించారు.

About Author