PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల్లో పనిచేసిన పోలీస్ అధికారులను తిరిగి వారి జిల్లాలకు బదిలీలు చేయాలి

1 min read

డిజీపికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర పోలీస్ సంఘం నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పోలీసు అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జనకుల శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ నెంబర్లు  మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు. రాష్ర్ట డిజిపి ద్వారక తిరుమల రావు ఐ.పి.ఎస్ ని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఎన్నికల సందర్భంగా ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినటువంటి Rank promotee SI/RSIs, CIs, RIs (Civil, AR, APSP)  లను ఎన్నికలు ముగిసిన సందర్భముగా వీరిని వారి వారి జిల్లాలకు తిరిగి బదిలీ చేయమని కోరుతూ రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దీనిపై  డిజిపి  సహృదయంతో స్పందించి వారం రోజులలో  బదిలీలను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారని సంఘ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author