PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి గెలుపు మాదిగల అభివృద్ధికి మలుపు… శ్రీకాంత్

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్  వ్యవస్థాపకులు, అధ్యక్షులుమిట్టా, శ్రీకాంత్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగానే మాదిగల మాత్రమే కాక దళిత బహుజన వర్గాలు హత్యలకు గురికాబడ్డారని, ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆయన అన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ గత ఐదు నెలలుగా చంద్రన్న మాటే మాదిగలకు బాటని పోస్టర్ రిలీజ్  చేసి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మాదిగ పల్లెలో పోస్టర్ని అంటించి వాలంటీర్ గా టిడిపి పార్టీకి ఎంతగానో సహకరించమని  అధికారం లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. టిడిపి అధికారులోకిరాగానే మాదిగలకు చెందవలసిన హక్కులను సాధించుకోవడానికి టిడిపి ఎంతో సహకరిస్తుందని నమ్ముతున్నామని అన్నారు. టీడీపీ అధికారంలో రాగానే కార్పొరేషన్ ను యధావిధిగా. కొనసాగించాలి .   బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ విదేశీ విద్య పథకాలు మాదిగలకు  ఉపయోగించుకోవడానికి సహకరించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించాలి. అమరావతిలో మాదిగ భవన్ ఏర్పాటు చేయాలి. చర్మకారులు కొరకు ఏర్పాటు చేసిన అవుట్ సిటీ లు మళ్లీ పునర్మించాలి.  వైసిపి ప్రభుత్వం ఇబ్బందులు గురిచేసిన వారిపై కఠనచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలనుండి నిర్వాహకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author