PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ గా  ప్రకాష్ రావు ఏకగ్రీవ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేడు విజయవాడలో జరిగిన ఫ్యాప్టొ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక లో మరొక మారు కర్నూలు జిల్లా కు చెందిన ఆప్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు  రాష్ట్ర ఫ్యాప్తో కో చైర్మన్ గా ఎన్నిక కావటం, మరొక మారు ఉమ్మడి కర్నూలు జిల్లా కు ప్యాప్తో ఇంచార్జి రావడం గా చాలా సంతోషకరమైన విషయం . కర్నూలు జిల్లా యందు గతం లో జరిగిన FAPTO ఉద్యమాలు యందు కీలక నేత గా పేరున్న ప్రకాష్ రావు కు కర్నూలు జిల్లా అప్టా అద్యక్షుడు మధు సుదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సేవాలల్ నాయక్ మరియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అజీజ్ ప్రధాన కార్యదర్శి రఫీ పత్రిక ప్రకటనలో శుభాకాంక్షలు  తెలుపుతూ హర్షం వెలిబుచ్చారు.

About Author