PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి ఊహించని భారీ షాక్..

1 min read

మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ టీడీపీలో చేరిక

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీకి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ ,అతని సోదరుడు మున్సిపల్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుసేన్ లు వైసీపీని వీడి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. సోమవారం నందికొట్కూరు లో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. రబ్బానీ గ్రూప్స్ అధినేత హాజీ మొల్ల మహబూబ్ సాహెబ్ ,అతని కుమారులు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ ,కౌన్సిలర్ జాకీర్ హుసేన్ లకు చంద్రబాబు నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ,జనసేన పార్టీ నాయకులు ,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

About Author