PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరుపురాని మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు పట్టణంలో దివగంత. మాజీ ముఖ్యమంత్రి. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  75 వ జయంతిని సందర్భంగా భారీ ర్యాలీతో బయలుదేరి మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ పార్లమెంటు సభ్యురాలు  శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు యువ నాయకులు బుట్టా ప్రతుల్  ఆధ్వర్యంలో పట్టణంలో సోమప్ప సర్కిల్ నందు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  చిత్ర పటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.  నియోజవర్గ వైసిపి నాయకులు,అభిమానులతో కలిసి వైఎస్ఆర్ సర్కిల్లో స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహానికి పూలమాల సమర్పించి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు,బ్రెడ్స్ ,పండ్లు,పంపిణీ చేసిన యువ నాయకులు బుట్టా ప్రతుల్ అనంతరం బుట్టా ప్రతుల్  మాట్లాడుతూ తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయినాడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో వై రుద్ర గౌడ్, బిఆర్ బసిరెడ్డి, శివారెడ్డి గౌడ్, గడ్డం నారాయణరెడ్డి,డాక్టర్ రఘు, కేశన్న, విరుపాక్షి రెడ్డి, నజీర్ అహ్మద్,సునీల్ కుమార్,బీమి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author