PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలు హాల్ట్

1 min read

ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్రకుమార్ హామీ ఇచ్చారంటూ ఎంపీ పుట్టా మహేష్ హర్షం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఢిల్లీ రైల్ భవన్‌లో రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోచింగ్)  దేవేంద్ర కుమార్‌ ను  ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కలవడం జరిగింది, ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హల్ట్ (నిలుపుదల) చేయాలనీ మరోసారి దేవేంద్ర కుమార్‌ ను సవినయంగా కోరడం జరిగిందన్నరు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఏలూరులో వందే భరత్ రైల్ నిలుపుదల అయ్యేలా చూస్తాను అని దేవేంద్ర కుమార్‌ తెలియజేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలల్లో ఏలూరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రైల్వే ఉన్నతాధికారులను తరచుగా కలుస్తున్న విషయం తెలిసిందే నని అన్నారు.

About Author