PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీమను సస్యశ్యామలం చేయండి

1 min read

రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయండి

  • నీటి పారుదల శాఖ మంత్రిని కోరిన డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రిని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి కోరారు. శనివారం విజయవాడలో ఇరిగేషన్​ శాఖ మంత్రిని  ఎమ్మెల్యే డా. పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏడాదికేడాది పంటలు లేక కరువు కమ్ము కుందని, ప్రాజెక్టులు లేక వర్షం నీరు సముద్రంలో కలిసిపోతున్నందున… సీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు. వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తే  కర్నూలులో సాగు,తాగునీటి సమస్య శాశ్వితంగా పరిష్కరించినట్లవుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రిని కోరినట్లు ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి వెల్లడించారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు.

About Author