PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజకీయాల్లో గెలుపొటములు మాములే కార్యకర్తలు అధైర్య పడొద్దు

1 min read

మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  రాజకీయాల్లో గెలుపొటములు మాములే అని నాయకులు కార్యకర్తలు అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి సారిగా ఎమ్మెల్యే గా పోటీ చేసిన నన్ను ఇంతలా ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తో ఆయన సహకారం తో నియోజకవర్గం లో ఉన్న అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పరామర్శ :  ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని పలువురు నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. ఓటమి కి భయపడవద్దు అని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న ధైర్యం చెప్పారు. ఓడినంతమాత్రాన కుంగిపోవాల్సిన ఏమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాఘవేంద్ర రెడ్డి గెలుపు కోసం నా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

About Author