PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ నాయకులను పరామర్శించిన యువనేత గిరిమల్లేష్ గౌడ్

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్ తనయులు గిరిమల్లేష్ గౌడ్ హెబ్బటం గ్రామంలో వృద్దాప్య పింఛన్ల పంపిణీ విషయంలో నిన్నటి రోజున టీడీపీ ,వైసీపీ పార్టీలకు చెందిన నాయకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఈరోజు పెద్దగొడవకు దారితీసింది. ఈగొడవలో గాయపడిన వాల్మీకి గొనగడ్ల ఈరన్న మరియు మాజీ జడ్పీటీసీ కురువ అయ్యాలప్ప ను యువ నాయకులు గిరిమల్లేష్ గౌడ్ ఆదోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పరామర్శించారు.ముక్యంగా వాల్మీకి ఈరన్నకు ఛాతిపై బలమైన దెబ్బలు తగలడం వలన గుండెపోటు వచ్చే పరిస్తితి ఏర్పడి సీరియస్ ఉండటంతో గిరిమల్లేష్ గౌడ్ డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు పంపటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో యువ నాయకులు గిరిమల్లేష్ గౌడ్ తో పాటు హెబ్బటం గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author