PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ పిల్లల భవిష్యత్​ కోసం…బీజేపీకి ఓటు వేయండి..

1 min read

ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:భావితరాల భవిష్యత్​ కోసం…బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, తనను గెలిపిస్తే ఆదోనిని అభివృద్ధి చేసి చూపెడతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. గురువారం నగరంలోని గౌళిపేటలో  కూటమి( బీజేపీ–టీడీపీ–జనసేన) నాయకులు  ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, కాల్వలు, వీధిలైట్ల సమస్యలతో ఎన్నో అవస్థలను ఓపికతో భరిస్తున్నారని, వీటన్నింటికీ కారణం ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డేనని, ఈ సారి  ఆయనకు ఓటు వేస్తే ఆదోని అభివృద్ధిలో మరో 30 ఏళ్లు వెనకబడిపోవడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు… రైతులను సాగుపై ప్రోత్సహించలేదు… ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు…  మహిళలకు స్వయం ఉపాధి కల్పించలేదు…. ఇవి ఇలా ఉంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అసలు రాజధానే లేకుండా చేసిన ఘనత ఒక్క సీఎం జగన్​కే దక్కిందన్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా… భూకబ్జాలు, దందాలు, మట్కా, పేకాట, మద్యం, ఇసుక మాఫియా ను పెంచి పోషిస్తున్నాడని  ఘాటుగా విమర్శించారు. మీ పిల్లల భవిష్యత్​ కోసం… కమలం గుర్తుకు ఓటు వేసి ..తనను గెలిపించాలని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు మీనాక్షినాయుడు, మల్లప్ప, గుడిసె కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author